వరల్డ్ నంబర్ వన్ కావడమే లక్ష్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
- August 29, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు నగరానికి తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమెకు అభిమానులు, తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. కోచ్ , తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మూడోసారి వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ గెలిచానని సింధు వ్యాఖ్యానించింది. స్వర్ణం చేజారడం నిరాశ కలిగించినా... మూడోసారి తన మెడల్ కలర్ మార్చుకుంటానన్న మాట నిలుపుకున్నానని చెప్పింది. అటు సింధు ఆటతీరుపై కోచ్ గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో అద్భుతంగా పోరాడిందని, ఫిట్నెస్ లెవెల్స్ మరింత మెరుగైతే తనకు తిరుగుండదని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







