రెండు తెలుగు రాష్ట్రాలలో బారి విజయం కోసం ప్రయత్నం
- August 29, 2017
ఈ రోజుల్లో సినిమాకి ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేస్తే అంత ప్లస్ అవుతుంది. అందుకే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా, తన కొత్త సినిమా యుద్దం శరణం మూవీకి డిఫరెంట్ గా ప్రమోషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. యుద్దంశరణం కోసం చైతూ ఎలాంటి ప్రమోషన్స్ ని ప్లాన్ చేశాడో తెలుసా..?
అక్కినేని వారసుడు నాగ చైతన్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఓ వైపు తండ్రి సలహాలు తీసుకుంటూనే తనదైన శైలిలో విజయాలను అందుకుంటున్నాడు. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్స్ అందుకొని ఈ సారి మరో హిట్ ను అందుకొవాలని బాక్స్ ఆఫీస్ తో యుద్దానికి రెడీ అయ్యాడు చైతూ. తమిళనాడుకు చెందిన కృష్ణ మరిముత్తు అనే స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగచైతన్య నటించిన "యుద్ధం శరణం" సినిమాను సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇంతకు ముందు తీసిన చిత్రాలకు బిన్నంగా యాక్షన్-థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న యుద్దంశరణంతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అందుకోసం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకే రిలీజ్ కు ముందే ఆంద్రప్రదేశ్- తెలంగాణ లోని మెయిన్ సెంటర్స్ లో ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో చేసేందుకు సన్నద్ధమవుతున్నాడట. అందుకోసం చిత్ర నిర్మాత సాయికొర్రపాటి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. యుద్దం శరణం మూవీలో చైతు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాత్ర గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ తోనూ ఆకట్టుకుంటుందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇక శ్రీకాంత్ ఈ మూవీలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్ గెటప్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఇక రావు రమేష్, రేవతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యుద్దం శరణం మూవీతో చైతన్న మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









