ఆపరేషన్ థియేటర్ లో కొట్టుకున్న డాక్టర్లు.... తల్లీబిడ్డ మరణం

- August 29, 2017 , by Maagulf
ఆపరేషన్ థియేటర్ లో కొట్టుకున్న డాక్టర్లు.... తల్లీబిడ్డ మరణం

ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణానికి అత్యవసర సమయంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడతారు వైద్యులు. ఆపరేషన్ థియేటర్లో అన్నీ మర్చిపోయి పేషెంట్ ప్రాణాలు కాపాడ్డానికి శతవిధాల ప్రయత్నిస్తారు. అలాంటి డాక్టర్స్ పురిటినొప్పులు పడుతున్న ఓ మహిళకు ఆపరేషన్ చేసే సమయంలో పోట్లాటకు దిగి బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు.  ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో జరిగిందీ విషాదకరమైన ఘటన. ఇద్దరు వైద్యులు గర్భిణికి డెలివరీ చేస్తున్న సమయంలో గొడవ పడ్డారు. తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది వారిస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఇద్దరి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చివరికి తల్లీబిడ్డా కన్నుమూశారు. ఓ నర్స్ మొత్తం గొడవను వీడియో తీయడంతో విషయం వెలుగు చూసింది. ఇప్పుడీ ఫుటేజ్ వైరల్‌గా మారడంతో ఆస్పత్రి యాజమాన్యం దీనిపై విచారణ జరిపింది. బాధ్యులైన ఇద్దరు డాక్టర్లపై వేటు వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com