అదరగొట్టే మేకోవర్ తో వస్తున్న రామ్
- August 30, 2017
గత ఏడాది జనవరిలో హిట్ కొట్టిన 'నేను శైలజ' కాంబినేషన్ ఈసారి దసరాను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో అతి త్వరలో విడుదల కానుంది.
'నేను శైలజ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్ దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు కాగా స్రవంతి రవికిశోర్, పి.ఆర్.సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ జరిగే ఊటీ షెడ్యూల్తో టాకీ పార్ట్ పూర్తి కానుంది.
ఊటీ షెడ్యూల్తో 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం పూర్తి కానుంది. ఓ పాట మాత్రం చిత్రీకరించాల్సి ఉందట. ఇటలీలో ఈ పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.
'నేను శైలజ' తర్వాత మరోసారి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న తనకు మరో హిట్ ఖాయమంటున్నాడు రామ్. మరి రామ్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి..!
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









