అదరగొట్టే మేకోవర్ తో వస్తున్న రామ్

- August 30, 2017 , by Maagulf
అదరగొట్టే మేకోవర్ తో వస్తున్న రామ్

గత ఏడాది జనవరిలో హిట్ కొట్టిన 'నేను శైలజ' కాంబినేషన్ ఈసారి దసరాను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో అతి త్వరలో విడుదల కానుంది.
'నేను శైలజ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్ దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు కాగా స్రవంతి రవికిశోర్, పి.ఆర్.సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ జరిగే ఊటీ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తి కానుంది.
ఊటీ షెడ్యూల్‌తో 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం పూర్తి కానుంది. ఓ పాట మాత్రం చిత్రీకరించాల్సి ఉందట. ఇటలీలో ఈ పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.

'నేను శైలజ' తర్వాత మరోసారి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న తనకు మరో హిట్ ఖాయమంటున్నాడు రామ్. మరి రామ్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com