రస్ అల్ఖైమాలోని ఫ్యాక్టరీ నుంచి పెద్దమొత్తంలో 'డస్ట్ స్ప్రెడ్'
- August 31, 2017
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, రస్ అల్ ఖైమాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఆపరేషన్స్ని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాంతమంతటా విపరీతమైన డస్ట్ ఏర్పడిందనీ, దానికి కంపెనీ ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది మినిస్ట్రీ. సాంకేతిక పరమైన సమస్య కారణంగా యూనియన్ సిమెంట్ ఫ్యాక్టరీ పెద్దమొత్తంలో డస్ట్ని స్ప్రెడ్ చేసిందని పేర్కొన్నారు. ఉన్నపళంగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు తగిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవెన్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - రస్ అల్ ఖైమా - డాక్టర్ సైఫ్ మొహమ్మద్ అల్ ఘాయిస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







