'హైడ్ అండ్ సీక్' బీచ్ ఒడిశా లోని చండిపుర లో
- September 01, 2017
పగలు సముద్రంలో ఉండి.. రాత్రుళ్లు కనిపించే శివాలయం, ఉదయం కనిపించి సాయంత్రం సముద్రంలోకి వెళ్ళే దేవాలయం.. ఇలా అనేక వింతలు.. విశేషాలు.. మన దేశంలో కో కొల్లలు.. అంతేకాదు.. రంగుల రంగుల ఇసుక కలిగిన బీచ్ గురించి కూడా మనం విన్నాం.. తాజాగా.. రోజు కి రెండు సార్లు కనిపించకుండా మాయం అయ్యే బీచ్ ఒకటి ఉన్నది.. అదీ మనదేశంలో ఉన్నది.. ఆ బీచ్ ఎక్కడో కాదు.. ఒడిషా లోని చండిపుర సముద్ర తీరంలో ఉన్నది. ఈ సముద్ర తీరాన్ని 'హైడ్ అండ్ సీక్' అని కూడా పిలుస్తారు. ఎత్తైన అలలతో పాటు.. అతి తక్కువ ఎత్తులో ఉండే అలలను మనం ఈ తీరంలో చూడవచ్చు. ఈ విచిత్ర దృశ్యం చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం పోటెత్తుతారు. వివరాల్లోకి వెళ్తే...
ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి జాతీయ రహదారి 5 మీదుగా సుమారు 200 కి.మీ. దూరంలో బలసూర్ జిల్లా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 16 కి.మీ. దూరంలో సముద్ర తీరం ఉంది.. అలల వ్యత్యాసం వల్ల చండీపురం లోని సముద్ర తీరంలో ప్రసిద్ధి పొందిన అద్భుతాన్ని చూసేందుకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ప్రపంచంలో మాయమయ్యే ఏకైక బీచ్ ఇదే..! పూరి, కోణార్క్ దేవాలయాలను చూడడానికి వచ్చిన పర్యటకులు, ఈ ప్రాంతాన్ని చూడడానికి తప్పని సరిగా వస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







