కేంద్ర కేబినెట్ నుంచి దత్తాత్రేయకు ఇక పై సెలవు

- September 01, 2017 , by Maagulf
కేంద్ర కేబినెట్ నుంచి దత్తాత్రేయకు ఇక పై సెలవు

కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. బీజేపీ అధిష్టానం ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. తాజా పరిణామాలను చూస్తే మొదట 8 మంది కేంద్రమంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని నిన్న వచ్చిన సమాచారం. అయితే శుక్రవారం జరిగిన పలు పరిణామాలను చూస్తే.. 8 మందికంటే ఎక్కువమందికి ఉద్వాసన పలికే అవకాశమున్నట్లు సమాచారం. ఇవాళ మంత్రులు ప్రధాని మోదీకి కలిసి తమ రాజీనామాలను అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయలు తమ రాజీనామా లేఖలను మోదీకి అందజేశారు.
అయితే నిర్మలా సీతారామన్‌ను పార్టీకి మీడియా తరఫున ఛీప్‌గా నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. అలాగే దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రి వర్గం 2019 ఎన్నికల కేబినెట్‌గానే చర్చించబోతున్నట్లుగా తెలియవచ్చింది. కేంద్రకేబినెట్ విస్తరణ ఆదివారం ఉదయం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com