కేంద్ర కేబినెట్ నుంచి దత్తాత్రేయకు ఇక పై సెలవు
- September 01, 2017
కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. బీజేపీ అధిష్టానం ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. తాజా పరిణామాలను చూస్తే మొదట 8 మంది కేంద్రమంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని నిన్న వచ్చిన సమాచారం. అయితే శుక్రవారం జరిగిన పలు పరిణామాలను చూస్తే.. 8 మందికంటే ఎక్కువమందికి ఉద్వాసన పలికే అవకాశమున్నట్లు సమాచారం. ఇవాళ మంత్రులు ప్రధాని మోదీకి కలిసి తమ రాజీనామాలను అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయలు తమ రాజీనామా లేఖలను మోదీకి అందజేశారు.
అయితే నిర్మలా సీతారామన్ను పార్టీకి మీడియా తరఫున ఛీప్గా నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. అలాగే దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రి వర్గం 2019 ఎన్నికల కేబినెట్గానే చర్చించబోతున్నట్లుగా తెలియవచ్చింది. కేంద్రకేబినెట్ విస్తరణ ఆదివారం ఉదయం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







