బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం
- September 04, 2017
బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు జాగారం చేశారు. ఎడతెరిపిలేకుండా గత మూడు రోజుల నుంచి రాత్రి పూట బెంగళూరు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది.
బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిల్క్ బోర్డు జంక్షలోని రోడ్లలో నాలుగు అడుగుల ఎత్తులో నీరు చేరుకోవడంతో వాహనచోదకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గూరగుంటపాళ్య, కురబరహళ్ళి, బనశంకరి, కంగేరి, జయనగర, జేపీ నగర, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్ పురం, హెబ్బాళ, యలహంక తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు ప్రాంతాల్లో వర్షం నీరు డ్రైనేజ్ ల నుంచి రోడ్ల మీదకు రావడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న బీబీఎంపీ అధికారుల మీద ప్రజలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజ్ లు పూర్తిగా మూసివేయడంతో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు వార్డుల్లో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా సోమవారం మద్యహ్నం వరకు నిలిచిపోయింది. నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్, బెంగళూరు మేయర్ పధ్మావతి నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తు వారి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









