బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం
- September 04, 2017
బెంగళూరులో ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు జాగారం చేశారు. ఎడతెరిపిలేకుండా గత మూడు రోజుల నుంచి రాత్రి పూట బెంగళూరు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది.
బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిల్క్ బోర్డు జంక్షలోని రోడ్లలో నాలుగు అడుగుల ఎత్తులో నీరు చేరుకోవడంతో వాహనచోదకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గూరగుంటపాళ్య, కురబరహళ్ళి, బనశంకరి, కంగేరి, జయనగర, జేపీ నగర, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్ పురం, హెబ్బాళ, యలహంక తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు ప్రాంతాల్లో వర్షం నీరు డ్రైనేజ్ ల నుంచి రోడ్ల మీదకు రావడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న బీబీఎంపీ అధికారుల మీద ప్రజలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజ్ లు పూర్తిగా మూసివేయడంతో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు వార్డుల్లో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా సోమవారం మద్యహ్నం వరకు నిలిచిపోయింది. నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్, బెంగళూరు మేయర్ పధ్మావతి నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తు వారి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







