చైనా లో భారత్ విజయం
- September 04, 2017
డోక్లాం ప్రతిష్టంభనపై దౌత్యపరంగా విజయం సాధించిన భారత్కు కొద్దిరోజుల్లోనే... అంతర్జాతీయ వేదికపై మరో భారీ విజయం లభించింది. పాకిస్తాన్ పేరెత్తకుండానే ప్రధాని మోదీ దాయాది దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందుకు ఈడ్చుకొచ్చారు. చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల డిక్లరేషన్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తొయిబా పేర్లను కూడా చేర్చారు. జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మహ్మద్ సయీద్పై ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా కాపాడుతూ వస్తున్న చైనా... తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. జైషే మహ్మద్, లష్కరే మూకల కారణంగా పెచ్చరిల్లుతున్న హింసను చైనా ఖండించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్ధిక సాయం అందిస్తోందంటూ ఎంతోకాలంగా భారత్ చేస్తున్న ఆందోళనను చైనా పరిగణలోకి తీసుకుంది.
గతేడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ''ఉగ్రవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్..'' అంటూ గోవా బ్రిక్స్ సమావేశాల్లో మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు రేపాయి. తాజాగా చైనాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లోనూ పాకిస్తాన్కు మొట్టికాయలు పడడం విశేషం. లష్కరే తొయిబా, జైషే మహ్మద్లతో పాటు తాలిబన్, ఐఎస్ఐఎల్, అల్ ఖయిదా, హక్కానీ తదితర ఉగ్రసంస్థల హింసపైనా బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







