ఉంగరాల రాంబాబు విడుదల తేదీ ఖరారు
- September 05, 2017
సునీల్, మియాజార్జి జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెరకెక్కించిన ఈ చిత్రం సునీల్ నటించిన గత చిత్రాలకంటే హై స్టాండర్డ్లో ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దిల్రాజు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ "ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్రాజుతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ప్రత్యే కమైన కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందంటున్నారు సినిమా టీమ్. దర్శకుడు క్రాంతి మాధవ్ సిని మాను అద్భుతంగా తెరకెక్కించారు. కథలో భాగంగా వచ్చే కామెడీ ప్రేక్ష కులను నవ్విస్తుంది. ప్రకాష్రాజ్ కాంబినేషన్లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. సునీల్ పాత్ర నవ్విస్తూ అందరినీ ఆలోచింపచేస్తుంది.
పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉం ది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, అలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్రల పాత్రలు అందరినీ అలరిస్తాయి"అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









