తన ఔనత్యాన్ని చాటుకున్న గౌతమ్ గంభీర్
- September 05, 2017
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఔనత్యాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, వ్యక్తిగా తాను చేసే పనుల్లో ఎప్పుడూ ఓ మెట్టు ఎదుగుతుంటారు గంభీర్. తాజాగా ఆయన ప్రకటించిన ఓ నిర్ణయమే ఇందుకు కారణం. ఉగ్రదాడిలో మృతిచెందిన అధికారి అబ్దుల్ రషీద్. తండ్రి కోసం ఏడుస్తున్న కూతురు జోహ్రా ఫొటోపై స్పందిస్తూ మనస్సుకు హత్తుకునే పోస్ట్ చేశారు గంభీర్.
'జోహ్రా, జోలపాట పాడి నేను నిన్ను నిద్రపుచ్చలేను. కానీ నువ్వు నీ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు మాత్రం చేతనైన సాయం చేయగలను. నీ చదువు బాధ్యతలను జీవితాంతం చూసుకుంటానని' గంభీర్ ఓ ట్వీట్లో రాసుకొచ్చారు. 'నీ కన్నీటి బొట్టును నేలకు రాలనివ్వకు. నీ కన్నీటిబొట్టు తాకగానే భూమాత గుండె బరువెక్కుతోంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్కు ఇదే నా సెల్యూట్' అంటూ అందరిని కదిలించే విధంగా ట్విట్ చేశారు గంభీర్.
గత ఆగస్ట్లో జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్లో ఐపీఎల్ లో తన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ద్వారా అందుకున్న పారితోషికాన్ని సుక్మా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేసిన విషయం తెలిసిందే.
థ్యాంక్యూ గౌతమ్ సార్
తనకు సాయం చేస్తానని చెప్పిన క్రికెటర్ గౌతమ్ గంభీర్కు జవాను కూతురు జోహ్రా థన్యవాదాలు తెలిపింది. 'మీ ప్రకటనపై నాతో పాటు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా ధ్యేయమని' జోహ్రా చెప్పింది.
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









