వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!

- June 03, 2026 , by Maagulf
వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!

మక్కా: జాతీయ వ్యర్థాల నిర్వహణ కేంద్రం అధునాతన సాంకేతిక మరియు క్షేత్రస్థాయి వ్యవస్థలను అమలు చేయడంతో తన హజ్ కార్యకలాపాలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించింది.  మక్కాలో 1,691 క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనల అమలును పటిష్ఠంగా పర్యవేక్షించినట్లు పేర్కొంది. ఈ సారి కేవలం 85 నోటీసులు మరియు 54 జరిమానాలను మాత్రమే జారీ చేసినట్లు పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఉల్లంఘనలలో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసిందన్నారు.

క్షేత్రస్థాయి బృందాలు యాత్రికుల శిబిరాలలో సేంద్రీయ మరియు ఘన వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియను అమలు చేశాయన్నారు. అలాగే, బలి ఇచ్చిన జంతువుల వ్యర్థాలను డిజిటల్‌గా ట్రాక్ చేసినట్లు తెలిపింది. మొత్తంగా25,823 టన్నుల వ్యర్థాలను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com