బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య
- September 05, 2017
బెంగళూరు: ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.
బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి చొరబడ్డ దుండగులు తుపాకితో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన గౌరీని చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
గౌరీ లంకేశ్ హత్యపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని, దేశంలో మారుతున్న పరిస్థితులకు ప్రమాద ఘంటిక అని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!









