బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య
- September 05, 2017
బెంగళూరు: ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.
బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి చొరబడ్డ దుండగులు తుపాకితో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన గౌరీని చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
గౌరీ లంకేశ్ హత్యపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని, దేశంలో మారుతున్న పరిస్థితులకు ప్రమాద ఘంటిక అని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







