సినీ నటుడు కమల్తో నగ్మా భేటీ, రాజకీయాలపై చర్చ
- September 05, 2017
మొన్నటి వరకు రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తాడంటూ, రాడంటూ ప్రచారం సాగింది. బీజేపీ గేలమేస్తోందని మరో ప్రచారం. ఇప్పుడు కమల్హాసన్ వంతు వచ్చింది. తాను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రకటించిన ఆయన్ని.. తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది.
తమిళ రాజకీయాల్లో సూపర్స్టార్ రజనీకాంత్ సైడైపోయాడు. ఇప్పుడంతా లోకనాయకుడు కమల్హాసన్ హవా నడుస్తోంది. తాను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేశానంటున్న విశ్వనటుడితో మాజీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా భేటీ అయ్యారు. చెన్నై వెళ్లిన ఆమె.. కమల్ ఇంటికెళ్లి ఇంటసేపు ముచ్చటించడం హాట్ టాపిక్ అయింది.
కమల్ కొత్త పార్టీ పెడతాడా.. పాత పార్టీల్లోనే చేరతాడా అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. సొంత కుంపటి పెట్టుకునే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. దీంతో.. గ్లామర్ స్టార్ కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. తన రంగు కాషాయం కాదంటూ ఇప్పటికే ఆయన ప్రకటించాడు. అంటే.. బీజేపీలో చేరడు. ఇప్పటివరకు కమల్ని.. ప్రతి విషయంలో స్టాలిన్ వెనకేసుకొస్తున్నాడు. అయితే.. ఈయన మాత్రం కేరళ వెళ్లి కామ్రేడ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. అంటే.. కరుణానిధి వారసుల విషయంలో అంత పాజిటివ్గా లేడనే వాదన వినిపించింది. పైగా డీఎంకే పంచన చేరితే.. తాను సైడ్ హీరో అయిపోతాడు. ఎందుకంటే.. ఆ పార్టీలో స్టాలినే హీరో. ఆధిపత్య పోరులో సొంత అన్ననే దూరం పెట్టారు. అందుకే.. ప్రత్యామ్నాయాలపై కమల్ దృష్టి సారించాడనే టాక్ ఉంది. దీంతో.. ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ రంగంలోకి దిగింది. చర్చల కోసం నగ్మాను రాయబారిగా పంపినట్టు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రజనీకాంత్ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి, కమల్కు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫరేంటి? లోకనాయకుడి రియాక్షన్ ఏంటి.. అన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







