అమరవీరుల కుటుంబాలకు అండగా బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్'
- September 05, 2017
దేవుడు మనకిచ్చిన ఈ అపూర్వమైన మనిషి జీవితానికి సార్థకత చేకూరేది కష్టాల్లో ఉన్న సాటి మనిషికి సాయం చేయగలిగినపుడే... ఎంత డబ్బున్నా సాయం చేసే మనసుండాలి... స్పందించే హృదయం ఉండాలి...దేశం కోసం, దేశ రక్షణ కోసం కట్టుకున్న భార్యని, కన్నబిడ్డల్ని వదిలి రాత్రింబవళ్లు దేశ సరిహద్దులో రెప్పవాల్చకుండా పహారా కాస్తుంటారు సైనికులు. మన కోసం అంత చేస్తున్న సైనికులకి మనం కూడా ఎంతో కొంత చేయగలిగితే.. అవకాశం ఉన్న అందర్నీ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలంటున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు రమ్మని అక్షయ్ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఇండియా రైజింగ్' పేరుతో నిర్వహించిన ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో అక్షయ్ మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొన్న బడా వ్యాపార వేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు పుష్కలంగా పలుకుబడి, కావలసినంత సంపద ఉన్నాయి. అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు మీరు కాకుంటే ఎవరు ముందుకు వస్తారు అన్న అక్షయ్ మాటలకు బిజినెస్ మ్యాన్లంతా చలించి పోయారు.
ఇప్పటికే అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన www.bharatkeveer.gov.in వెబ్ సైట్ కు నిధులు రూ.15 లక్షలకు మించలేదు. ఈ వెబ్సైట్లో .. 112 మంది అమర వీరుల వివరాలున్నాయి. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఒక్కో కార్పోరేట్ సంస్థ కానీ, సీఈవో కానీ కనీసం ఒక రాష్ట్రానికి చెందిన అమరవీరులను దత్తత చేసుకోవడానికి ముందుకొస్తే.. ఆ సైనికుల కుటుంబాలకు సరిపడా నిధులు వసూలవుతాయన్నారు అక్షయ్. జాబితాలో ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన అమర వీరుల కుటుంబాల మొత్తానికి నేను విరాళ మిస్తానని అక్షయ్ కుమార్ అన్నారు. దీంతో కార్పోరేటర్స్ కూడా ముందుకొచ్చారు. విక్కి ఒబెరాయ్ ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకున్నారు. నిమిషాల్లోనే దాదాపు రూ.6.5 కోట్లను సేకరించగలిగారు. వెబ్ సైట్లో ఉన్న 60%మందికి ఈ డబ్బులు సరిపోతాయన్నారు అక్షయ్ కుమార్.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







