మాడా వెంకటేశ్వరరావుకు తుది వీడ్కోలు

- October 28, 2015 , by Maagulf
మాడా వెంకటేశ్వరరావుకు తుది వీడ్కోలు

అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన నలుగురు కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో మూడురోజుల క్రితం ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబసభ్యులు రాక ఆలస్యం కావడంతో భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి శవాగారంలోనే భద్రపరిచారు. ఈరోజు ఉదయం కుటుంబసభ్యులు రావడంతో అపోలో ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. మాడా వెంకటేశ్వరరావుకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అక్కడి నుంచి అంతియ యాత్ర నిర్వహించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com