అర్జున్ రెడ్డి తో సినిమాకి నో చూపిన లావణ్య
- September 06, 2017
అందాలరాక్షసి లావణ్య త్రిపాఠికి ఈ ఏడాది లక్ కుదర్లేదు. మిస్టర్, రాధ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇక ఆశలన్నీ 'యుద్ధం శరణం' మీదే ఉన్నాయి. రామ్తో 'ఉన్నది ఒక్కటే జిందగీ' చేస్తోంది ఆమె. అర్జున్రెడ్డితో ఫుల్ఫామ్లోవున్న విజయ్ హీరోగా పరశురామ్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు ముందుగా కమిటయిన లావణ్య, ఇప్పుడా మూవీ చేయలేనని తప్పుకుందట. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. ముందుగా చెప్పిన కథలో తన రోల్ తగ్గించి అర్జున్రెడ్డి హిట్తో విజయ్ రోల్కు ఎక్కువగా ప్రయార్టీ ఇవ్వడమే రీజన్ అని తెలుస్తోంది. జనరల్గా రేస్లోవున్న హీరో కాంబో వదిలేయడం ఆషామాషీ కాదు.. మరి లావణ్య లక్ ఎలా ఉండబోతుందో! మరోవైపు లావణ్య ప్లేస్లో శాండిల్వుడ్ బ్యూటీ రష్మికను తీసుకున్నారు. గతేడాది కన్నడలో 'కిరిక్ పార్టీ' మూవీతో పాపులర్ అయ్యింది ఈ సుందరి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







