లావ్ర్ అబుదాబీ ప్రారంభానికి సిద్ధం
- September 06, 2017
యూఏఈ: ఐకానిక్ లావ్ర్ అబుదాబీ మ్యూజియం, నవంబర్ 11న ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. సాదియాత్ ఐలాండ్లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అబుదాబీ టూరిజం మరియు కల్చర్ అథారిటీ ఛైర్మన్, ఛైర్మన్ ఆఫ్ ది టూరిజం డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ మాట్లాడుతూ, ఈ మ్యూజియం ఓ కొత్త ప్రపంచంలా ఉంటుందని చెప్పారు. 2007లో ఫ్రాన్స్, అబుదాబీ మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. 97,000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ జీన్ నోవెల్ ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. 8 లేయర్లతో 180 మీటర్ల వెడల్పుగల డోమ్ మొత్తం మ్యూజియంని కవర్ చేస్తుంది. ఆర్ట్ గ్యాలరీలతోపాటు, టెంపరరీ ఎగ్జిబిషన్ స్పేస్, చిల్డ్రన్స్ మ్యూజియం, 200 సీటర్ ఆడిటోరియం, రెస్టారెంట్, కేఫ్, రిటైల్ స్పేస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలంటే పెద్దలు 60 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. 13 ఏళ్ళలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. విద్యార్థులకు, ఆర్మ్డ్ ఫోర్సెస్, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ప్రత్యేకమైన ఆఫర్లు త్వరలో వెల్లడిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







