యేసు మహిమలుతో రాబోతున్న తొలి కిరణం సినిమా
- September 06, 2017
యేసు మహిమలు
పి.డి. రాజు యేసుక్రీస్తుగా నటించిన సినిమా ‘తొలి కిరణం’. జాన్ బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి. సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. జాన్ బాబు మాట్లాడుతూ – ‘‘జీసస్ జీవితంలో ఇప్పటివరకూ చూపించని కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సుమారు 5 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తీశాం. తొలి కాపీ చూశా. అద్భుతంగా వచ్చింది. క్రీస్తు పాత్రలో పి.డి. రాజు జీవించాడు.
శిలువ వేసే సన్నివేశాలు చిత్రీకరించడానికి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ఓ రోజు చర్చిలో ప్రార్థన చేస్తుంటే అతనికి ప్రభువు కనిపించాడు. అన్ని మతాలు, అన్ని వర్గాల వారు చూసేలా సినిమా ఉంటుంది. ప్రభువు మహిమలను ప్రతి ఒక్కరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.’’ అన్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







