1993 ముంబై పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష.. ఇద్దరికి జీవిత ఖైదు విధించిన కోర్టు
- September 07, 2017
1993 ముంబైలో వరుస పేలుళ్లతో మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న కేసులో నిందితులకు టాడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కరీముల్లా ఖాన్కు జీవిత ఖైదు విధించింది. అలాగే అబూ సలెంకు కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు. పోర్చుగల్తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం శిక్ష జీవితఖైదుకే పరిమితమైంది. పోర్చుగల్లో మరణశిక్షలు అమలులో లేకపోవడంతో జీవితఖైదు విధించింది కోర్టు.
పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తహీర్ మర్చంట్లను దోషులుగా పేర్కొంది కోర్టు. మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు.
నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు దోషులపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. మార్చి 12,1993న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై 2300 పేజీలతో కోర్టు తుది తీర్పు చెప్పింది.
ముంబై పేలుళ్ల కేసులో ఇది రెండో దఫా విచారణ. మొదటి దశ విచారణ 2007లో ముగిసింది. అందులో వందమందిని దోషులుగా టాడా కోర్టు తీర్పు వెలువరించింది. మరో 23 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







