రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి
- September 07, 2017
జెడ్డా: ఈద్ అలా సెలవుల సందర్భంగా రియాద్ నుంచి అభాకి వెళుతున్న ఓ భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రియాద్లోని టెలి కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ కంపెనీలో పనిచేస్తోన్న అబ్దుల్ రెహ్మాన్, తన భార్య ఖుఱ్సీద్ బానుతో కలిసి అభాకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ రెహ్మాన్, ఖుఱ్సీద్ బాను, వారి కుమార్తె ఫౌజియా అక్కడికక్కడే చనిపోయారు. వారి కుమారుడు ముజాఫర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం వారి సన్నిహితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రెహ్మాన్, బెంగళూరుకి చెందిన ఖుర్షీద్ని వివాహం చేసుకున్నారు కొన్నేళ్ళ క్రితం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









