రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి
- September 07, 2017
జెడ్డా: ఈద్ అలా సెలవుల సందర్భంగా రియాద్ నుంచి అభాకి వెళుతున్న ఓ భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రియాద్లోని టెలి కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ కంపెనీలో పనిచేస్తోన్న అబ్దుల్ రెహ్మాన్, తన భార్య ఖుఱ్సీద్ బానుతో కలిసి అభాకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ రెహ్మాన్, ఖుఱ్సీద్ బాను, వారి కుమార్తె ఫౌజియా అక్కడికక్కడే చనిపోయారు. వారి కుమారుడు ముజాఫర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం వారి సన్నిహితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రెహ్మాన్, బెంగళూరుకి చెందిన ఖుర్షీద్ని వివాహం చేసుకున్నారు కొన్నేళ్ళ క్రితం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







