శ్రీలంక కుటుంబం ఆత్మహత్యపై షార్జా పోలీసుల విచారణ
- September 07, 2017
షార్జా: శ్రీలంకకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి షార్జా పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు కుటుంబ సభ్యుల గల ఆ కుటుంబం, హోటల్ అపార్ట్మెంట్లోని ఏడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు. మొత్తం ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 55 ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, ఓ కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కువైగ్ హాస్పిటల్లో వారికి చికిత్స అందించారు. విజిట్ వీసాపై ఈ కుటుంబం దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









