శ్రీలంక కుటుంబం ఆత్మహత్యపై షార్జా పోలీసుల విచారణ
- September 07, 2017
షార్జా: శ్రీలంకకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి షార్జా పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు కుటుంబ సభ్యుల గల ఆ కుటుంబం, హోటల్ అపార్ట్మెంట్లోని ఏడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు. మొత్తం ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 55 ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, ఓ కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కువైగ్ హాస్పిటల్లో వారికి చికిత్స అందించారు. విజిట్ వీసాపై ఈ కుటుంబం దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







