శ్రీలంక కుటుంబం ఆత్మహత్యపై షార్జా పోలీసుల విచారణ

- September 07, 2017 , by Maagulf
శ్రీలంక కుటుంబం ఆత్మహత్యపై షార్జా పోలీసుల విచారణ

షార్జా: శ్రీలంకకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి షార్జా పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు కుటుంబ సభ్యుల గల ఆ కుటుంబం, హోటల్‌ అపార్ట్‌మెంట్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు. మొత్తం ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 55 ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, ఓ కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించారు. అల్‌ కువైగ్‌ హాస్పిటల్‌లో వారికి చికిత్స అందించారు. విజిట్‌ వీసాపై ఈ కుటుంబం దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com