'గల్ఫ్' నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం
- September 08, 2017
శంషాబాద్: ఓమాన్ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి ఉత్తిచేతులతో స్వదేశం చేరిన గల్ఫ్ వలసకార్మికులకు ప్రోటోకాల్ అధికారులు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నంగి దేవేందర్ రెడ్డి, డా. అస్మా ఖాన్ లు శనివారం ఉదయం హైదరాబాద్ ఏర్ పోర్ట్ లో ఆత్మీయ స్వాగతం పలికారు. ఒమాన్ లో పెట్రాన్ గల్ఫ్ అనే కంపెనీ మూసేయడం వలన 50 మంది తెలంగాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన బాలపెల్లి గంగారెడ్డి, కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన బింగి రవి అనే ఇద్దరు కార్మికులు ఇండియన్ ఎంబసీ సహాయంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్టు పొంది శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు చెల్లించారు.
పునరావాసం కల్పించాలి.
జీతం బకాయిలు, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు నష్టపోయి ఇంటికి చేరారని, ప్రభుత్వం వీరికి పునరావాసం కలిపించాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంపెనీ యాజమాన్యం నుండి బకాయిలను రాబట్టుకోవడానికి కార్మికులు లేబర్ కోర్టులో కేసు వేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో న్యాయ సహాయం చేయాలని ఆయన కోరారు.
బాధితుల ఫోన్ నెంబర్లు: బాలపెల్లి గంగారెడ్డి 99499 36795 బింగి రవి 96033 50632
ఇట్లు: నంగి దేవేందర్ రెడ్డి 81436 88886


తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







