మణిరత్నం దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేశ్
- September 08, 2017
ఎస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ ఐశ్వర్యరాజేశ్ను వరించింది. హీరోయిన్ పాత్రే కావాలంటూ అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న నటి ఐశ్వర్యరాజేశ్. కాకాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుతంగా నటించి ప్రశంసలు పొందిన ఈ సహజ నటికి ఆ తరువాత స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు తలుపుతడుతున్నాయి.
ప్రస్తుతం విక్రమ్ సరసన ధ్రువనక్షత్రం, ధనుష్తో వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్ బాలీవుడ్లో నటించిన డాడీ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. వీటితో పాటు మలయాళంలోనూ అడుగుపెట్టిన ఐశ్వర్యరాజేశ్కు తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. కాట్రువెలియిడై చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా దర్శకుడు మణిరత్నం తాజా చిత్రానికి రెడీ అయ్యారు.
ఇందులో నటించే నటీనటుల గురించి ఇంతకు ముందు రకరకాల ప్రచారం జరిగినా తాజాగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించే విషయం పక్కాగా ఓకే అయ్యిందని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు ఇందులో నటి జ్యోతిక కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నటుడు విజయ్సేతుపతి, టాలీవుడ్ హీరో నాని ఈ క్రేజీ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









