హుబ్లీలో తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు
- September 09, 2017
హుబ్లీలో కన్నడిగులు వీరంగం సృష్టించారు. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వచ్చిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. కర్ణాటక రీజినల్ రూరల్ బ్యాంక్ ఉద్యోగాలకు తెలుగువారని పరీక్షలు రాయనివ్వబోమని తేల్చి చెప్పారు. హుబ్లీలో పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడులు చేశారు. తమ ఉద్యోగాలను తన్నుకు పోతున్నారంటూ ఆరోపించారు. హుబ్లీ, గుల్బర్గా, దావణగెరె, బెంగళూరులో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హుబ్లీ రైల్వే స్టేషన్ ముందు ధర్నాకు దిగిన కన్నడిగులు అక్కడే చాలా మంది తెలుగువారిని అడ్డుకున్నారు. కన్నడ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే చంపేస్తామని బెదిరించారు. నంద్యాల నుంచి పరీక్ష రాయడానికి వెళ్లిన వారిపై దాడులు చేశారు. రెండు రోజుల క్రితమే కర్ణాటకకు వచ్చిన తెలుగువారిపై ఓ కన్నేశాయి కన్నడ సంఘాలు. తెలుగువారితో పాటు చాలా మంది కర్ణాటక విద్యార్థులు నంద్యాలలోనే కోచింగ్ తీసుకున్నారు. తెలుగువారు కర్ణాటకకు పరీక్షలు రాయడానికి వస్తున్నారని, వారే సమాచారం అందించారు. లాడ్జీల్లో ఉన్న వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జీల్లో తెలుగువారికి రూమ్ ఇవ్వొద్దని, ఆటోల్లో ఎక్కించుకోవద్దని హుకుం జారీ చేశారు. అటు పరీక్ష సెంటర్ల దగ్గరా అడ్డుకుంటామని చెప్పడంతో తెలుగు అభ్యర్థులు భయపడిపోతున్నారు. కన్నడ సంఘాల తీరుతో అంతరాయాలు కలగడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







