హైదరాబాద్లో ప్రారంభం అయినా జీఎస్టీ కౌన్సిల్ భేటీ
- September 09, 2017
నగరంలో తొలిసారి జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రారంభమైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. అంతకుముందు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. జీఎస్టీ విషయమై తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ప్రజోపయోగ పనులపై జీఎస్టీని ఎత్తివేయాలని తెలంగాణ సర్కారు కోరుతూ వస్తోంది. ఒకవేళ పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయడం సాధ్యపడకపోతే.. 18 నుంచి 5శాతానికి పన్ను కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ విషయాన్ని ఈటల రాజేందర్ ప్రధానంగా లేవనెత్తే అవకాశముంది.
ఫలక్నుమా ప్యాలెస్లో విందు
జీఎస్టీ సమావేశంలో తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జైట్లీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, అతిథుల బృందానికి ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి వచ్చే అతిథులకు పోచంపల్లి చేనేత వస్త్రాలతోపాటు రాష్ట్ర పర్యాటక వివరాలు, చారిత్రక సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే జ్ఞాపికలను బహూకరించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







