మునిగిపోతున్న నౌక నుండి 20 మందిని రక్షించిన సాహసవీరునికి సత్కారం

- September 09, 2017 , by Maagulf
మునిగిపోతున్న నౌక నుండి 20 మందిని రక్షించిన సాహసవీరునికి సత్కారం

మస్కట్ : నడి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక నుండి మొత్తం సిబ్బందిని రక్షించిన ఒమన్ మత్స్యకారుడు ఫయీజ్  అల్ జునిబి సాహసానికి ఒమన్ రవాణా మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ బిన్ సలీం అల్ ఫుటీసీక కృతజ్ఞతలు తెలిపారు. దుఖ్మ్ మత్స్యకారుడు మంత్రిని కలుసుకున్నారు. మునిగిపోతున్న ఓడ నుంచి 20 మందిని కాపాడిన ఆయన ప్రయత్నాలకు గాను ప్రభుత్వం ఆయనకు అందించిన  ప్రశంసపత్రాన్ని ఈ సందర్భంగా  ఆయనకు అందించారు. "అల్ జజీర్ తీరానికి చెందిన మునిగియున్న ఓడ యొక్క సిబ్బందిని రక్షించిన ఫయీస్ అల్ జునిబి సాహసం ఒక  అత్యున్నతమైన  మానవతా చర్య, "మంత్రి ఆన్లైన్ లో తెలిపారు. వారాంతంలో ఓ ఓడ  సముద్రంలో ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంది.అంతేకాక నీరు నౌకలోనికి రావడం మొదలైంది. ఎదుర్కొంటున్నఇబ్బంది గూర్చి ఓడ సిబ్బంది సమీపంలో ఉన్న చేపలను వేటాడే పడవకు సందేశం పంపారు. దాంతో స్పందించిన మానవత్వం ఉన్నమత్స్యకారుడు  ఫయాజ్ విజయవంతంగా అక్కడకు చేరుకొని  25 నిమిషాల వ్యవధిలో వారినందరిని ఆయా విపత్తు నుండి రక్షించి   తన చేపలను వేటాడే పడవ లోనికి ఎక్కించుకొని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com