మునిగిపోతున్న నౌక నుండి 20 మందిని రక్షించిన సాహసవీరునికి సత్కారం
- September 09, 2017
మస్కట్ : నడి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక నుండి మొత్తం సిబ్బందిని రక్షించిన ఒమన్ మత్స్యకారుడు ఫయీజ్ అల్ జునిబి సాహసానికి ఒమన్ రవాణా మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ బిన్ సలీం అల్ ఫుటీసీక కృతజ్ఞతలు తెలిపారు. దుఖ్మ్ మత్స్యకారుడు మంత్రిని కలుసుకున్నారు. మునిగిపోతున్న ఓడ నుంచి 20 మందిని కాపాడిన ఆయన ప్రయత్నాలకు గాను ప్రభుత్వం ఆయనకు అందించిన ప్రశంసపత్రాన్ని ఈ సందర్భంగా ఆయనకు అందించారు. "అల్ జజీర్ తీరానికి చెందిన మునిగియున్న ఓడ యొక్క సిబ్బందిని రక్షించిన ఫయీస్ అల్ జునిబి సాహసం ఒక అత్యున్నతమైన మానవతా చర్య, "మంత్రి ఆన్లైన్ లో తెలిపారు. వారాంతంలో ఓ ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంది.అంతేకాక నీరు నౌకలోనికి రావడం మొదలైంది. ఎదుర్కొంటున్నఇబ్బంది గూర్చి ఓడ సిబ్బంది సమీపంలో ఉన్న చేపలను వేటాడే పడవకు సందేశం పంపారు. దాంతో స్పందించిన మానవత్వం ఉన్నమత్స్యకారుడు ఫయాజ్ విజయవంతంగా అక్కడకు చేరుకొని 25 నిమిషాల వ్యవధిలో వారినందరిని ఆయా విపత్తు నుండి రక్షించి తన చేపలను వేటాడే పడవ లోనికి ఎక్కించుకొని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







