బ్లూ కాలర్‌ వర్కర్స్‌ క్యాంపెయిన్‌కి అవార్డ్‌

- September 09, 2017 , by Maagulf
బ్లూ కాలర్‌ వర్కర్స్‌ క్యాంపెయిన్‌కి అవార్డ్‌

దుబాయ్‌: ఎక్స్‌ప్రెస్‌ మనీ సంస్థకు దుబాయ్‌ పోలీస్‌ జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ నుంచి అవార్డ్‌ దక్కింది. బ్లూ కాలర్‌ వర్కర్స్‌కి సంబంధించి పెడెస్ట్రియన్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌ నిర్వహించినందుకుగాను ఎక్స్‌ప్రెస్‌ మనీ ఈ పురస్కారం దక్కించుకుంది. 'క్రాస్‌ సేఫ్లీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఎక్స్‌ప్రెస్‌ మనీ నిర్వహించింది. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సైఫ్‌ ముహైర్‌ దుబాయ్‌ పోలీస్‌ ట్రోఫీ, సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ ఏప్రీషియేషన్‌ను ఎక్స్‌ప్రెస్‌ మనీ టీమ్‌ మెంబర్స్‌కి అందజేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బ్లూ కాలర్‌ కమ్యూనిటీకి సంబంధించినంతవరకు పలు అవేర్‌నెస్‌ క్యాంపెయిన్స్‌ని నిర్వహిస్తూ ఎక్స్‌ప్రెస్‌ మనీ తన ప్రత్యేకతను చాటుకుంటోందని ఈ సందర్బంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌ మనీ సిఓఓ సుదేష్‌ గిరియాన్‌ మాట్లాడుతూ, తమ సిబ్బంది ఈ విషయంలో చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధను అభినందించారు. దుబాయ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తమకు సేవా రంగంలో సహకరిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com