నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిరోహించారు
- October 28, 2015
నేపాల్ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిరోహించారు. గత నెలలో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలో బిధ్యా దేవి భండారి విజయం సాధించారు. ఇప్పటిదాకా ఆమె అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వైస్ ఛైర్ పర్సన్గా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుల్ బహదూర్ గురుంగ్ను ఆమె ఓడించారు. మొత్తం 327 ఓట్లకు గాను బిధ్యాకు 214 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిధ్యా భండారి ఎన్నికైనట్లు పార్లమెంటరీ స్పీకర్ ఒన్సారి ఘర్తీ ప్రకటించారు. నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత బిధ్యా భండారి దేశ రెండో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు దేశంలో రాజరిక పాలన కొనసాగిన విషయం తెలిసిందే. భండారి కంటే ముందు రాంభరణ్ యాదవ్ ఏడేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







