సోషల్ మీడియా లో ఫొటోస్ పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించండి
- September 10, 2017
లగ్జరీ కారుతో ఎంచక్కా ఇన్స్టాగ్రామ్లోనో, కాస్ట్లీ వాచ్తో ఫేస్బుక్లోనే కనిపిస్తే ఇక పన్ను అధికారులు తలుపు తట్టే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి నల్లధనం వెలికితీతకు పన్ను అధికారులు సోషల్ మీడియానూ జల్లెడ పట్టనున్నారు. ఆదాయ వెల్లడి, ఖర్చు పెట్టే తీరు మధ్య వ్యత్యాసాలను పసిగట్టేందుకు సోషల్ మీడియా సైట్ల నుంచి సమాచారాన్ని విశ్లేషించేందుకు పన్ను అధికారులు ‘ప్రాజెక్ట్ ఇన్సైట్’ను చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇన్సైట్ అమలు కోసం ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ఎల్అండ్టీ ఇన్ఫోటెక్తో ఒప్పందం చేసుకుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను గుర్తించి బ్లాక్ మనీ పంపిణీకి చెక్ పెట్టడంలో ఈ ప్రాజెక్టు పన్ను అధికారులకు సహకరిస్తుంది. నోట్ల రద్దు అనంతరం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పన్ను ఎగవేతలు, బ్లాక్మనీని గుర్తించేందుకు వర్చువల్ సమాచారాన్నివినియోగించుకుంటామని పన్ను అధికారులు తెలిపారు.వ్యక్తి ఆదాయం, ఆస్తులను పూర్తిస్ధాయిలో పరిశీలించేందుకు పాన్, ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం అనివార్యం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









