బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- April 21, 2026
త్రివేండ్రం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్లోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. త్రిస్సూర్ లోని పూరం వేడుక కోసం ముండతికోడ్లో నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 40మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.
ముండతికోడ్లో సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఘటన జరిగిన వెంటనే బాణసంచా యూనిట్ మంటలు చెలరేగాయి.. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన కొందరిని మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీకి తరలించారు.
ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఘటనా స్థలానికి అదనంగా అంబులెన్సులను తరలించాలని అధికారులకు సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







