బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- April 21, 2026
త్రివేండ్రం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్లోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. త్రిస్సూర్ లోని పూరం వేడుక కోసం ముండతికోడ్లో నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 40మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.
ముండతికోడ్లో సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఘటన జరిగిన వెంటనే బాణసంచా యూనిట్ మంటలు చెలరేగాయి.. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన కొందరిని మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీకి తరలించారు.
ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఘటనా స్థలానికి అదనంగా అంబులెన్సులను తరలించాలని అధికారులకు సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









