ఇన్ఫోసిస్ వారి శుభవార్త

- September 10, 2017 , by Maagulf
ఇన్ఫోసిస్ వారి శుభవార్త

బెంగుళూరు: ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ వచ్చే రెండేళ్ళలో ఏటా ఆరువేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇన్పోసిస్‌లో ఇటీవల చోటుచేసుకొన్న సంక్షోభాలు రిక్రూట్‌మెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని తేలింది.
విశాల్ సిక్కా ఇన్పోసిస్ సిఈఓ పదవికి రాజీనామా చేయడం, శేషసాయి లేఖ తదితర వివాదాలు ఇన్పోసిస్‌ తీవ్ర సంక్షోభంలో ఉందనే ప్రచారం నెలకొంది. ఈ విషయమై కార్పొరేట్‌ రంగంలో కూడ తీవ్ర చర్చ కూడ జరిగింది ఇన్ఫోసిస్‌. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగిస్తామని ఇన్పోసిస్ ప్రకటించింది.
ఈ ఏడాది కొత్తగా ఆరు వేలమందికి ఉపాధి కల్పించనున్నాం. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే విధంగా నియామకాలు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటన చేసింది. ఈ మేరకు ఇన్పోసిస్ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు ప్రకటించారు.
ఏటా 10లక్షల మంది గ్రాడ్యుయేట్‌లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పారు.ఈ ఏడాది జూన్‌ నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com