"తాను బతికే ఉన్నానని " 19 నెలల పోరాటం తర్వాత స్వదేశానికి ప్రయాణం
- September 10, 2017
కువైట్: ఓ చనిపోయిన వ్యక్తి పేరు ...బతికి ఉన్న వ్యక్తికి ఉండటం ..ఆ ఇద్దరిది ఒకే ప్రాంతం కావడం ఆ భారతీయుడికి పెద్ద శాపం అయింది. వివరాలలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భారతీయుడు తాను బతికే ఉన్నానని నెలల తరబడి పోరాటం తర్వాత చివరకి తాను పనిచేసే కువైట్ నుంచి ఎట్టకేలకు తన స్వదేశం భారతదేశానికి చేరుకొన్నాడు. 19 నెలల క్రితం...2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్ చెందిన నరేష్ తన వార్షిక సెలవులను భారతదేశంలో గడిపేందుకు సిద్ధమై కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొన్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశం విడిచి వెళ్లనివ్వకుండా నిరోధించారు. కారణం ఆ పేరు గల ప్రయాణీకుడు ఏనాడో చనిపోయాడు. నీవెవరవని అధికారులు నిలదీసేసరికి నరేష్ నీరుగారిపోయాడు. అనంతరం ఆ వ్యక్తిపై పూర్తి విచారణ తర్వాత, తన పాస్పోర్ట్లో అతికించిన వీసా స్టిక్కర్ అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తిధీ అని అతను మరణించాడని అదే పేరుతో మరో వ్యక్తి సజీవంగా ఉన్నట్లు కువైట్ అధికారులు తేల్చారు. విమాన ప్రయాణానికి సిద్ధమైన వ్యక్తి మరణించిన వ్యక్తి కాదని రుజువు చేయటానికి 19 నెలలకాలం పట్టింది. త.ఈ సంఘటన ప్రతి ప్రవాసీయునికి ఒక హెచ్చరికను ఇస్తుంది వారి పాస్పోర్ట్ లో వివరాలు సరైనవి కాదా అని తెల్సుకొని అతికించిన వీసా స్టిక్కర్ వివరాలను తనిఖీ చేసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









