హైదరాబాద్ లో పది మంది నైజీరియన్ల అరెస్ట్‌

- September 11, 2017 , by Maagulf
హైదరాబాద్ లో  పది మంది నైజీరియన్ల అరెస్ట్‌

భాగ్యనగరంలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం గచ్చిబౌలి కమీషనర్‌ కార్యాలయంలో రాచకొండ జాయింట్‌ కమీషనర్‌ తరుణ్‌జోషి మీడియాతో మాట్లాడారు.

నిందితుల వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, 8 పాస్‌పోర్ట్‌లు, 25 సెల్‌ఫోన్‌లు, 15 డేటా కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  మీ ఫోన్‌ నెంబర్‌ లక్కీ డ్రాలో ఎంపిక అయిందని మాయమాటలు చెప్పి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com