బుల్లి తెరపై యాంకర్ ఉదయభాను రీ ఎంట్రీ

- September 11, 2017 , by Maagulf
బుల్లి తెరపై యాంకర్ ఉదయభాను రీ ఎంట్రీ

బుల్లి తెరపై సందడి చేయడానికి మళ్లీ ఉదయభాను వచ్చేస్తోంది. ఒకప్పుడు హృదయాంజలి ప్రోగ్రామ్‌తో బుల్లి తెరపై సందడి చేసి ప్రేక్షకుల మనసును దోచుకుంది.  ఆ తరువాత ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించింది.  ఆ తరువాత పెళ్లి, పిల్లల తో కొంతకాలం స్క్రీన్‌కు దూరంగా ఉంది.  ఇప్పుడు మళ్లీ మరోసారి ఎంట్రీ ఇవ్వబోతోంది.  స్టార్ మా నిర్వహించే 'నీ తోనే' అనే డాన్స్ షోలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. భాను ఈజ్ బ్యాక్ అంటూ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com