మరోసారి పెరిగిన పుత్తడి ధర

- September 11, 2017 , by Maagulf
మరోసారి పెరిగిన పుత్తడి  ధర

బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత శుక్రవారం ఒక్కసారిగా రూ.990 పెరిగిన పసిడి.. మరుసటి రోజే రూ.820 తగ్గడం గమనార్హం. తాజాగా సోమవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధర మరోసారి పైకెగసింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.470 పెరిగి రూ.31,000లకు చేరింది. పండుగ సీజన్‌ రానుండటం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర కిలో రూ.42,000 దిగువకు పడిపోయింది. రూ.300 తగ్గిన వెండి కిలో రూ.41,700లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.77శాతం తగ్గి ఔన్సు 1,335.70 డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com