హత్య కేసులో వ్యక్తి అరెస్ట్ ..మృతదేహం నూతిలోనికి విసిరివేత
- September 11, 2017
మస్కట్ : ఆసియా దేశానికి చెందిన ఓ నిందితుడు హత్య చేయడమే కాక మృతదేహాన్ని పాడుబడిన నూతిలోనికి విసిరివేశాడని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి) వెల్లడించింది, హంతకుడు తన నేరంను కప్పిపుచ్చుకునేందుకు విలాయట్ లోని మహ్దా లో ఎవరూ ఉపయోగించని బావిలోనికి చనిపోయిన శవాన్ని పడవేసినట్లు ఒక ఆర్ ఓ పి అధికారి తెలిపారు. విచారణ మరియు నేర పరిశోధన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ బరియామ్ పోలీసులు ఆ హత్య కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 3 వ తేదీన ఒక వ్యక్తి అదృశ్యం కావడం గురించి ఒక పిర్యాదు అందుకొన్న తర్వాత ఈ కేసుని పరిశోధించేందుకు ఒక బృందం ఏర్పడింది. ఈ నేరంతో సంబంధం ఉండవచ్చనే ఒక అనుమానంతో ఆసియా దేశానికి చెందన ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని దాంతో ఆ అనుమానితుడు తానే ఆ హత్య చేసినట్లు అంగీకరించాడని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తేలిపారు.అనుమానితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్నిబావి లోనికి తోసివేసినట్లు దర్యాప్తు బృందంకు తెలిపాడు. కాగా చనిపోయిన వ్యక్తి శరీరంపై కత్తులతో పొడిచినట్లు పలు గాయాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







