ఎమిరేట్స్ ఎకానమీ: భారత్, పాకిస్తాన్లకి మరో 10 కిలోల బ్యాగేజీ
- September 11, 2017
ఎంపిక చేసిన కొన్ని డెస్టినేషన్స్ కోసం దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ తమ ప్రయాణీకులకు లగేజ్ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ కొత్త వెసులుబాటు ప్రకారం అదనంగా 10 నుంచి 15 కిలోల బ్యాగేజ్ని తీసుకెళ్ళే అవకాశం ఉంది. అబిదజాన్, అక్రా, దకర్, ఎటెబ్బె, హరారే, లాండా, లాగోస్, లుసాకా, మనీలా, కైరో, కసాబ్లాంకా, నైరోబీ, అడ్డిస్ అబాబా, అల్జీర్స్ గువాంగ్జో మరియు డార్ ఎస్ సలామ్ తదితర ప్రాంతాలకు 15 కిలోల్ని అదనంగా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణీకులు తీసుకెళ్ళే వీలుంది. అమ్మాన్, ఇస్లామాబాద్, కాబూల్, ఖార్తౌమ్, లాహోర్, ముల్తాన్, సియాల్కోట్, ట్యునీషియా, పెషావర్ ప్రాంతాలకు 10 కిలోలు అదనం తీసుకెళ్ళొచ్చు. కరాచి, ఢాకా, షల్హెట్, చిట్టగాంగ్, ముంబై, కోచి, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నయ్, జకార్తా, సెబు, క్లార్క్ మరియు కొలంబోలకు 10 కిలోల బ్యాగేజీని ఎంపిక చేసిన విమాన సర్వీసుల్లో తీసుకెళ్ళడానికి వీలుంది. సెప్టెంబర్ 30 లోపు అమ్ముడయ్యే టిక్కెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టిక్కెట్లతో డిసెంబర్ 13 వరకు ప్రయాణం చేయొచ్చు. స్కైవార్డ్స్ మెంబర్స్కి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సరికొత్త ఆఫర్లను అందిస్తోంది. సిల్వర్ మెంబర్స్ 12 కిలోలు, గోల్డ్ మెంబర్స్ 16 కిలోలు, ప్లాటినం మెంబర్స్ 20 కిలోలను అదనంగా తీసుకెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







