మహి.వి.రాఘవకు రూ. 7 కోట్ల లాస్
- September 12, 2017
టైటిల్ చూసి అదేంటి 'ఆనందో బ్రహ్మ' సినిమా హిట్ అయ్యింది కదా ఆ డైరెక్టర్ కు లాస్ రావడమేంటి అని అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ మొత్తం చూడాల్సిందే..'ఆనందో బ్రహ్మ' ను డైరెక్టర్ చేసిన మహి.వి.రాఘవ ఎంబీఏ చేసి కొన్నేళ్లు ఉద్యోగం చేయడంతో పాటు బిజినెస్ కూడా చేసి బాగానే వెనకేసుకున్నాడు. ఐతే సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ముందు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడట. 'విలేజ్ లో వినాయకుడు'.. 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలను నిర్మించాడు. ఈ రెండూ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ రెండిటి వల్ల డబ్బులు పోయాయి.
ఆ తర్వాత మహి.. స్వీయ దర్శకత్వంలో 'పాఠశాల' అనే సినిమాను నిర్మించాడు. సినిమా బాగా తీసాడు , సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదట. దీంతో ఈ మూడింటి వల్ల దాదాపు రూ. 7 కోట్ల మేర డబ్బులు పోగొట్టుకున్నాడట. ఇక నిర్మాణ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యి 'ఆనందో బ్రహ్మ' ను కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కించి , దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చింది. శాటిలైట్ హక్కులు.. రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే.. ఈ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం ఆర్జించినట్లన్నమాట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







