మహి.వి.రాఘవకు రూ. 7 కోట్ల లాస్
- September 12, 2017
టైటిల్ చూసి అదేంటి 'ఆనందో బ్రహ్మ' సినిమా హిట్ అయ్యింది కదా ఆ డైరెక్టర్ కు లాస్ రావడమేంటి అని అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ మొత్తం చూడాల్సిందే..'ఆనందో బ్రహ్మ' ను డైరెక్టర్ చేసిన మహి.వి.రాఘవ ఎంబీఏ చేసి కొన్నేళ్లు ఉద్యోగం చేయడంతో పాటు బిజినెస్ కూడా చేసి బాగానే వెనకేసుకున్నాడు. ఐతే సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ముందు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడట. 'విలేజ్ లో వినాయకుడు'.. 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలను నిర్మించాడు. ఈ రెండూ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ రెండిటి వల్ల డబ్బులు పోయాయి.
ఆ తర్వాత మహి.. స్వీయ దర్శకత్వంలో 'పాఠశాల' అనే సినిమాను నిర్మించాడు. సినిమా బాగా తీసాడు , సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదట. దీంతో ఈ మూడింటి వల్ల దాదాపు రూ. 7 కోట్ల మేర డబ్బులు పోగొట్టుకున్నాడట. ఇక నిర్మాణ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యి 'ఆనందో బ్రహ్మ' ను కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కించి , దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చింది. శాటిలైట్ హక్కులు.. రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే.. ఈ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం ఆర్జించినట్లన్నమాట.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









