సౌదీ అరేబియా ఐఎస్ బాంబ్ ప్లాట్: సౌదీలో నలుగురి అరెస్ట్
- September 12, 2017
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కి చెందిన నలుగురు వ్యక్తుల్ని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు సూసైడ్ బాంబర్లుగా మారి విధ్వంసానికి యత్నించారని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ తెలిపారు. వారిలో ఇద్దరు యెమనీయులు కాగా, మరో ఇద్దరు సౌదీకి చెందిన వారు. ఈ నలుగురూ ఐఎస్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులుగా గుర్తించారు. రియాద్లోని రెండు డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ని నిందితులు టార్గెట్ చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ విడుదల చేసిన ఫొటోల్లో నిందితులకు సంబంధించిన వివరాలున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు వారు వినియోగించదలచిన ఆయుధాల్ని కూడా ప్రదర్శించారు. 2014 నుంచి షియాస్, సెక్యూరిటీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఐఎస్ తీవ్రవాద సంస్థ పలు దాడులకు వ్యూహరచన చేస్తూనే ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







