యూఏఈ రోడ్డు ప్రమాదం: యంగ్ డ్రైవర్ మృతి
- September 12, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేసింది. యువకుడు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో ఉండగా చెట్టుని ఢీకొంది. చెట్టును ఢీకొన్న అనంతరం, ల్యాంప్ పోస్ట్ వైపుకు కారు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రస్ అల్ఖైమాలోని అల్ దగ్దగ - ఎయిర్పోర్ట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నామనీ, దురదృష్టవశాత్తూ యువకుడ్ని ప్రాణాలతో కాపాడలేకపోయామని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ కంట్రోల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ అల్ హుమైది వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







