బ్రిటన్ పర్యటనకు-మోదీ
- October 29, 2015
క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ గౌరవార్థం నవంబర్ 13న బకింగ్ హ్యామ్ ప్యాలెస్ లో క్వీన్ ఎలిజబెత్ విందు ఇవ్వనున్నారు. వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరువుతారని భావిస్తున్నారు. తర్వాత కామెరూన్ తో భేటీ అవుతారు. సమయం ఉంటే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. నవంబర్ 14న ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







