ఫ్యామిలీ ఎంటర్టైనర్తో విశాల్
- October 29, 2015
ఇటీవలే 'జయసూర్య' లాంటి క్రైమ్ థ్రిల్లర్తో మంచి విజయం సాధించిన విశాల్ ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్ష కులను అలరించడానికి సిద్ధమయ్యారు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ (నటుడు శరత్కుమార్ కుమార్తె) హీరో హీరోయిన్లుగా రూపొం దిన తమిళ చిత్రం 'మద గజ రాజా'(ఎం.జి.ఆర్)ని శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి తెలుగులో అందించనున్నారు. ''భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కనువిందు చేస్తుంది. తెలుగు టైటిల్ను త్వర లో ప్రకటిస్తాం. ఇందులో తమిళ హీరో ఆర్య అతిథి పాత్రలో మెరిశారు. 'జిల్లా' తర్వాత మేం అందిస్తున్న సినిమా ఇది'' అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, ఛాయాగ్రహణం: రిచర్డ్, సమర్పణ: జెమినీ ఫిలిం సర్క్యూట్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







