బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఆస్తులు సీజ్‌

- September 13, 2017 , by Maagulf
బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఆస్తులు సీజ్‌

గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను బ్రిటన్ ప్రభుత్వం సీజ్ చేస్తోంది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులను బ్రిటన్‌ జప్తు చేయడం ఒకరకంగా భారత్‌కు దౌత్యపరమైన విక్టరీగా భావిస్తున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో మాఫియా డాన్ దావూద్ మోస్ట్ వాంటెడ్‌. 2015వ సంవత్సరంలో దావూద్‌కు చెందిన కొన్ని ఫైల్స్‌ను బ్రిటన్‌కు భారత్ అందజేసింది. భారత్ ఇచ్చిన ఆధారలతోనే గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఆస్తులను బ్రిటన్ సీజ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇటీవలే పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఓ కీలక సమాచారాన్ని బయటపెట్టారు. డాన్ దావూద్ కరాచీలో ఉన్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com