పెరుగుతున్న పుత్తడి ధరలు, తగ్గుతున్న అమ్మకాలు
- September 13, 2017
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నారు. పదిగ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరింది. గత వారం రోజుల్లో శుక్రవారం ఒక్కరోజే గ్రాముకు రూ.990 కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ క్షీణించడంతో ఇన్వెస్టర్ల దృష్టి బంగారం పై పడింది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దసరా సీజన్, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కారణంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 32 వేలకు చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవిధంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరగడానికి పలు కారణాలు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనుకావడం ఒకటైతే మరోవైపు మధుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం ధరల పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







