భారీగా అమ్ముడుపోయిన పవన్ త్రివిక్రంల మూవీ రైట్స్
- September 13, 2017
'కాటమరాయుడు' తర్వాత పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. సినిమా అమెరికా, నైజాం హక్కులు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపారు. అమెరికాలో రూ. 21 కోట్లకి, నైజాంలో రూ. 29 కోట్లకి అమ్ముడుపోయినట్లు ట్వీట్ చేశారు.
'బాహుబలి 2' కాకుండా థియేట్రికల్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రాబట్టిన తెలుగు చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
పవన్ 25వ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఖుష్బూ, మురళీశర్మ, రావురమేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







