మద్యం మత్తులో మహిళపై అత్యాచారయత్నం
- September 14, 2017
మద్యం మత్తులో ఓ వ్యక్తి, బస్ స్టాప్ నుంచి ఓ మహిళను కిందికి లాగేసి, ఓ ట్రక్ వెనకాలకు ఆమెను తీసుకెళ్ళి, ఆమెపై అత్యాచార యత్నం చేసిన కేసులో నిందితుడిపై కేసు నమోదయ్యింది. 24 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఫిలిప్పీన్కి చెందిన మహిళను బస్ స్టాప్లో గుర్తించాడు. ఎవరూ లేని సమయంలో ఆమెను అక్కడినుంచి తీసుకెళ్ళి ఓ ట్రక్ వెనుక ఆమెపై అత్యాచారానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. అటుగా వెళుతున్న నలుగురు వ్యక్తులు బాధితురాలి అరుపులతో అటువైపు వెళ్ళి, నిందితుడ్ని పట్టుకున్నారు. అయితే నిందితుడు తనపై మోపబడ్డ అభియోగాల్ని ఖండిస్తున్నాడు. జులై 12న అల్ కోజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తనకు తెలియదని నిందితుడు చెబుతున్నాడు. అయితే నిందితురాలు మాత్రం ఆ సమయంలో తాను చాలా ఆందోళనకు గురయ్యాననీ, సకాలంలో అటువైపుగా వచ్చిన కొందరు తనను రక్షించారని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన 42 ఏళ్ళ భారతీయుడొకరు, ఆ సమయంలో అటుగా వాహనం నడుపుతున్న తనకు బాధిత మహిళను ఓ వ్యక్తి బలంగా తీసుకెళుతుండడం కన్పించిందనీ, తన కారుని అక్కడికి పోనిచ్చి నిందితుడ్ని పట్టుకున్నానని చెప్పారు. మరో నలుగురు వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించినా, అతన్ని గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షి.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









