యు.ఏ.ఈ లో శుక్రవారంతో ముగియనున్న లేబర్ మిడ్ డే బ్రేక్
- September 14, 2017
యు.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, జూన్ 15న ప్రారంభమైన మిడ్ డే బ్యాన్ సెప్టెంబర్ 15తో ముగియనుందని ప్రకటించింది. ఇన్స్పెక్షనల్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మెహర్ అల్ ఒబెద్ మాట్లాడుతూ, మిడ్ డే బ్రేక్ రూల్ని పాటించినవారందరికీ అభినందనలు తెలిపారు. 13 ఏళ్ళుగా ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉంటోంది. తీవ్రమైన వేసవి తాపం కారణంగా, మధ్యాహ్న సమయాల్లో ఎండలో పనిచేసేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న దరిమిలా మిడ్ డే బ్యాన్ని తెరపైకి తెచ్చారు. మిడ్ డే బ్యాన్ సందర్భంగా నిర్దేశిత పని గంటల్లో మాత్రమే ఔట్ డోర్లో కార్మికులతో పని చేయించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులకు తగిన సౌకర్యాల్నీ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. మిడ్ డే బ్యాన్ ముగిసిన తర్వాత యధాతథంగా పని గంటలు ఉంటాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









