యు.ఏ.ఈ లో శుక్రవారంతో ముగియనున్న లేబర్ మిడ్ డే బ్రేక్
- September 14, 2017
యు.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, జూన్ 15న ప్రారంభమైన మిడ్ డే బ్యాన్ సెప్టెంబర్ 15తో ముగియనుందని ప్రకటించింది. ఇన్స్పెక్షనల్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మెహర్ అల్ ఒబెద్ మాట్లాడుతూ, మిడ్ డే బ్రేక్ రూల్ని పాటించినవారందరికీ అభినందనలు తెలిపారు. 13 ఏళ్ళుగా ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉంటోంది. తీవ్రమైన వేసవి తాపం కారణంగా, మధ్యాహ్న సమయాల్లో ఎండలో పనిచేసేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న దరిమిలా మిడ్ డే బ్యాన్ని తెరపైకి తెచ్చారు. మిడ్ డే బ్యాన్ సందర్భంగా నిర్దేశిత పని గంటల్లో మాత్రమే ఔట్ డోర్లో కార్మికులతో పని చేయించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులకు తగిన సౌకర్యాల్నీ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. మిడ్ డే బ్యాన్ ముగిసిన తర్వాత యధాతథంగా పని గంటలు ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







